EPAPER

Mudragada : జనసేనానిపై ముద్రగడ లేఖాస్త్రం.. పవన్ విమర్శలకు కౌంటర్..

Mudragada : జనసేనానిపై ముద్రగడ లేఖాస్త్రం.. పవన్ విమర్శలకు కౌంటర్..


Mudragada Padmanabham letter(Political news in AP): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అటు కౌంటర్ గా ద్వారంపూడి అదే రేంజ్ లో ఫైరయ్యారు. ఇప్పుడు ఈ ఇష్యూలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఆయన నేరుగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ లేఖ రాయడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

కాపు రిజర్వేషన్‌ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారని ఇటీవల వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ స్పందించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదని స్పష్టం చేశారు. యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని వివరణ ఇచ్చారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారన్నారు. రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్‌ కల్పించారని స్ట్రాంగ్‌గా బదులిచ్చారు.


కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ముద్రగడ ఖండించారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి సహకరించారని గుర్తుచేశారు. పవన్‌ భాష సరిగా లేదన్నారు. వీధిరౌడీలా మాట్లాడటం సరికాదని సూచించారు. కాపు ఉద్యమానికి పవన్ ఎందుకు రాలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలని పవన్ కు సవాల్ చేశారు. మరి ముద్రగడ లేఖపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×