TS Govt employees news(Latest news in Telangana): తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పంది. డీఏ, పింఛనుదారులకు డీఆర్ 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉత్తర్వులు ఇచ్చామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
2022 జనవరి నుంచి డీఏ పెంపు వర్తిస్తుంది. సర్కార్ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.974.16 కోట్ల భారం పడుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ.1,380.09 కోట్ల బకాయిలను చెల్లిస్తారు.
డీఏ పెంపుపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.