Kamareddy news telugu(Latest news in Telangana): పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. గుండెపోటుతో చనిపోయాడు. ఈ మధ్యకాలంలో చిన్న వయసులలోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.ఉద్యోగం సంపాదించానన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే బీటెక్ విద్యార్ధి ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సాధించాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తీవ్ర విషాదం నింపింది.
తమ కొడుక్కి ఉద్యోగం వచ్చిన ఆనందాన్ని తల్లిదండ్రులు స్వీట్లు పంచుకుని సంబరం చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం షాక్కు గురైంది. చేతికొచ్చిన బిడ్డ ఇలా గుండెపోటుతో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
బీటెక్ విద్యార్ధి ప్రసాద్ జగదాంబ తాండకు చెందిన వ్యక్తి. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు గన్నాడు. అనుకున్నట్టుగానే చదువు పూర్తికాక ముందే ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆ కల పూర్తిగా నెరవేరక ముందే గుండెపోటుతో చనిపోయాడు.