Murder News Hyderabad(Breaking news updates in Telangana): అతనో ఆలయంలో పూజారి. పేరు వెంకట సాయికృష్ణ. ఆ పక్కనే ఉండే యువతి అప్సర.. తరుచూ ఆ ఆలయానికి వస్తుండేది. అలా అలా వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. అదికాస్తా శారీరక సంబంధంగా మారింది. కలిసిమెలిసి ఉండేవాళ్లు. తిరిగేవాళ్లు. ఒకళ్ల ఇంటికి ఒకళ్లు వెళ్లేవారు. ఆ పూజారికి అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో వారి రిలేషన్ మీద ఎవరికీ అనుమానం రాలేదు.
కట్ చేస్తే.. కొంత కాలం తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ అప్సర.. ఆ పూజారిని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. అతనేమో ఎంజాయ్ చేసి వదిలేద్దాం అనుకున్నాడు. ఆమె మాత్రం గట్టిగా తగులుకోవడంతో పూజారి ఇరుక్కుపోయాడు. అప్పటికే ఓ సారి అబాషన్ కూడా చేయించినట్టు తెలుస్తోంది.
పెళ్లి పెళ్లి అంటూ అప్సర వెంటబడుతుండటంతో.. పూజారి ఇక ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. సరూర్నగర్లో ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. శంషాబాద్ పరిధిలోని నర్కుడకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడు. కారులోనే చంపేశాడు. ప్రాణం పోయిందని కన్ఫామ్ చేసుకున్నాక.. డెడ్బాడీని కారులో మళ్లీ సరూర్నగర్ తీసుకొచ్చాడు. అక్కడ ఓ మ్యాన్హోల్లో పడేసి.. ఏమీ తెలీనట్టు ఇంటికొచ్చేశాడు. ఇదంతా జూన్ 3న జరిగింది.
అప్సర తల్లి పూజారి సాయికృష్ణను కలిసి తన కూతురు కనిపించడం లేదని చెప్పింది. భద్రాచలం వెళ్తానని చెప్పిందని ఆమెను నమ్మించాడు పూజారి. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని.. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన మేనకోడలు అప్సర కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెడితే.. అది అటూఇటూ తిరిగి మళ్లీ పూజారి చెంతకే చేరింది. సాయికృష్ణనే అప్సరను చంపి.. మ్యాన్హోల్లో పడేశాడని తేల్చారు పోలీసులు. విచారణలో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు పూజారి. ఆమె మరోసారి గర్భవతి అయ్యిందని.. తనను పెళ్లి చేసుకోమని వేధిస్తుండటంతో.. చంపేశానని చెప్పాడు సాయికృష్ణ.
పూజారి సమాచారంతో మ్యాన్హోల్ నుంచి అస్పర డెడ్బాడీని బయటకు తీశారు. అప్పటికే హత్య జరిగి వారం గడవడంతో.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అప్సర గతంలో ఓ తమిళ సినిమాలో చిన్న క్యారెక్టర్లో నటించింది.