Delhi Liquor Case Latest News(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. తాను అప్రూవర్గా మారుతానంటూ కోర్టును రిక్వెస్ట్ చేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది ఈడీ.
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం.. ఎమ్మెల్సీ కవితకు షాకింగ్ పరిణామమే అంటున్నారు. ఇప్పటికే కవిత ఆడిటర్ బుచ్చిబాబును విచారించి వివరాలు సేకరించింది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తరఫున కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి సైతం ఢిల్లీ లిక్కర్ దందాలో భారీగా పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆరోపణ. ఆప్కు ముడుపులు అందించిన వారిలో శరత్ కూడా ముందున్నారు. ఇప్పుడాయన అప్రూవర్గా మారడంతో.. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై మరింత కీలక సమాచారం ఈడీకి చేరనుంది. అసలు, కవితకు ఉచ్చు బిగించేందుకే.. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అప్రూవర్గా మార్చిందనే వాదనా ఉంది.