The Kerala Story(Latest breaking news in telugu): ది కేరళ స్టోరీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఉత్తర ప్రదేశ్లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ది కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు సీఎం యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. అంతకు ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో యోగి సర్కార్ కూడా వచ్చి చేరింది.
ఈ సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవైఖరులు అవలంభిస్తున్నాయి. రిలీజ్ వద్దంటూ కేరళ, తమిళనాడు, బెంగాల్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే.. సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ వచ్చిన తరువాత తాము కలుగజేసుకోలేమేని న్యాయస్థానాలు కొట్టిపారేశాయి.
సినిమా విడుదల తరువాత కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఆందోళనలకు తలొగ్గి కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిలిపివేశారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో సినిమా రిలీజ్ కాలేదు. యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించి.. సినిమాను ఎంకరేజ్ చేస్తున్నాయి.
ది కేరళ స్టోరి వివాదం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ సినిమాను బ్యాన్ చేయడంపై మూవీ మేకర్స్ సుప్రీం తలుపు తట్టారు. సినిమాకు లైన్ క్లియర్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.