KCR Latest News(Telangana Politics): సీఎం కేసీఆర్ మాటలు తెలంగాణలో కాక రేపుతున్నాయి. దళితబంధు లబ్దిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు పైసా వసూల్ చేస్తున్నారంటూ.. వారి చిట్టా తన దగ్గర ఉందంటూ సంచలన కామెంట్లు చేశారు. ఆయా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే.. టికెట్ కాదు కదా పార్టీ నుంచే వెళ్లగొడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోరంటూ దాడి చేస్తున్నాయి.
ఈ ఎపిసోడ్పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సైతం స్పందించారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పిన ప్రకారమే లెక్కిస్తే.. దళితబంధులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. కమిషన్లు తిన్న ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేల పేర్లు బయటపెడితే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని బయటపెడతారని భయపడుతున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అంటే కరప్షన్ చంద్రశేఖర్ రావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.