PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్నారు. అనుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.
విమానం దిగగానే పీఎం మోదీకి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానిని రిసీవ్ చేసుకున్నారు.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. బండి సంజయ్.. మోదీకి నమస్కరిస్తే.. ప్రధాని ఆప్యాయంగా సంజయ్ను చేయితట్టి విష్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం విమానాశ్రయంలో మోదీకి వెల్కమ్ చెప్పారు.
అనంతరం.. నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు ప్రధాని మోదీ.