Mushrooms:– కేవలం టెక్నాలజీతోనే కాదు.. ప్రకృతి వైద్యంతో కూడా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నయం చేయవచ్చని ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు కూడా నిరూపించారు. తాజాగా కొచ్చిన్కు చెందిన మహిళ వ్యవస్థాపకురాలు మష్రూమ్స్తో చేసిన ఓ మెడికల్ మ్యాజిక్ చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఆమె తయారు చేసిన మష్రూమ్స్ మెడికల్ రంగంలో ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
తాజాగా కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (క్యూసాట్) ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ట్రాన్ఫర్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ (సిట్టిక్) అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో మంజుషా అని బయోటెక్నాలజీలో పీహెచ్డీ సాధించిన ఒక మహిళ కూడా పాల్గొన్నారు. ఇంతకు ముందు క్యూసాట్లో ఆమె లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం మానేసి రెడిఫై గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్ను ప్రారంభించారు.
రెడిఫై గ్లోబల్ కంపెనీలో ఆమె పూర్తిగా మెడిసినల్ ప్లాంట్స్ను పెంచడం మొదలుపెట్టారు మంజుషా. అందులోనూ ముఖ్యంగా మష్రూమ్స్ను పెంచడం ప్రారంభించారు. ప్రొటీన్, విటమిన్స్ లాంటివి ఎక్కువగా ఉండే మిల్కీ మష్రూమ్స్ను పెంచడంలో మంజుషా ఫేమస్ అయ్యారు. తను పెంచుతున్న మెడికేటెడ్ మష్రూమ్స్ విషయంలో పెట్టుబడులు పెట్టడానికి ఐఐటీ బొంబాయి సైతం ముందుకొచ్చింది. అంతే కాకుండా ఈ మష్రూమ్స్ క్యాన్సర్, న్యూరోజెనరేటివ్ డ్రగ్స్గా కూడా ఉపయోగపడతాయని పరీక్షించిన నిపుణులు తెలిపారు.
తనలాగే సక్సెస్ సాధించాలనుకుంటున్న ఎంతోమంది మహిళ వ్యవస్థాపకురాళ్లను తన మష్రూమ్స్ బిజినెస్లో భాగం చేసుకోవాలని ఆశిస్తున్నారు మంజుషా. దానికోసమే ప్రొడక్షన్ను పెంచాలని సన్నాహాలు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా మష్రూమ్స్ను పెంచే విషయంలో ట్రైనింగ్ అందించనున్నారు. మెడికల్ రంగంలో మష్రూమ్స్ అవసరం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అది తన బిజినెస్కు కమర్షియల్ వాల్యూను తెచ్చిపెట్టిందని మంజూషా తెలిపారు.
మహిళల్లో పోషకాహార లోపం కనిపెట్టే టూల్..
for more updates follow this link:-bigtv