Military employees:-ఆహార పదార్థాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్య సమస్యల నుండి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఎంత పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయినా కూడా అంతుచిక్కని వ్యాధులు ప్రస్తుతం మానవాళిని ఇబ్బందులు పెడుతున్నాయి. సిటీలో ఉంటూ మూడు పూటలా తింటున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. కష్టమైన వాతావరణంలో జీవిస్తూ కడుపు నిండా తినలేని సైనికులు పరిస్థితి ఏంటి..? అందుకే వారి ఆరోగ్య సమస్యలపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.
సరిగా సమయానికి తినకపోయినా.. లేదా సరిపడా తినకపోయినా గ్యాస్ సమస్యలు అనేవి కామన్గా కనిపిస్తాయి. దాని వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రస్తుతం డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ (డీఎస్టీఎల్) మిలిటరీలో పనిచేసే వారి గ్యాస్ట్రోఇంటెస్టైనియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మామూలుగా స్వచ్ఛమైన తాగునీరు లేని ప్రాంతాలకు వెళ్తూ పనిచేస్తున్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు.
ఒక దేశంలోనే ఉంటూ పనిచేస్తున్న మిలిటరీ ఉద్యోగుల కంటే వేరే దేశాలకు వెళ్లి పనిచేసే ఉద్యోగుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు గమనించారు. డయేరియా కూడా ఈ ఇన్ఫెక్షన్ లక్షణమే అని వారు చెప్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళుతున్న ఉద్యోగుల మైక్రోబయోమ్ను, అదే దేశంలో పనిచేస్తున్న ఉద్యోగుల మైక్రోబయోమ్ను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు.
ఇతర ప్రాంతాలకు వెళుతున్న ఉద్యోగుల మైక్రోబయోమ్పై వాతావరణ మార్పులు, జియోగ్రాఫీ, డైట్ వంటి అనేక అంశాల ప్రభావం పడినట్టు వారు గుర్తించారు. దీని వల్లే అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని అన్నారు. ప్రస్తుతం వీరి పరిశోధనలో బయటపడిన విషయాలను బట్టి త్వరలోనే మిలిటరీ ఉద్యోగుల ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు.
రెయిన్బో కలర్స్ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..
for more updates follow this link:-bigtv