Jagan: అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్.. సంథింగ్ డిఫరెంట్గా సాగింది. రొటీన్ ప్రసంగాలకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, విధానాలు, రాజకీయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. చివర్లో అదిరిపోయే డైలాగులు చేశారు. జగన్ ఏమన్నారంటే…
–నా నడక నేలమేద, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే..
–నా యుద్ధం.. పెత్తందార్లతోనే..
–నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే..
–ఇదే నా ఎకనామిక్స్.. ఇదే నా పాలిటిక్స్..
–ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ.. ఇవన్నీ కలిపితేనే మీ జగన్.
ఇదీ సీఎం జగన్మోహన్రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు. చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఆ డైలాగులు. పంచ్ పదాలు, ప్రాసల కోసం పాకులాడకుండా.. గుండె లోతుల్లోంచి వచ్చినట్టుగా అనిపించాయి. జగన్ శైలికి సరిగ్గా అతికినట్టు ఉన్నాయి. అవన్నీ తన తండ్రి వైఎస్సార్ నుంచి నేర్చుకున్నానని చెప్పడం హైలైట్.
–నాకు ఇండస్ట్రీ రంగం ఎంత ముఖ్యమో.. వ్యవసాయం అంతే ముఖ్యం.
–నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. అవ్వతాతలు కూడా అంతే ముఖ్యం.
–ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమే.
–గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నా.
–కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం.
–నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి.
–ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.
–ఆర్థిక నిపుణులే అధ్యయం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది.
అలా అలా సాగింది అసెంబ్లీలో జగన్ ప్రసంగం. మొత్తం 50 నిమిషాల పాటు తన పాలన గురించి సవివరంగా, లెక్కలతో సహా సభకు వివరించారు ముఖ్యమంత్రి. మొత్తం విషయాన్ని చివర్లో ఇలా కొన్ని వ్యాఖ్యలతో సమ్అప్ చేయడం బాగుందని ప్రశంసిస్తున్నారు వైసీపీ నేతలు, అభిమానులు.
Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..