Rain: ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు మండిపోతున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 39 డిగ్రీలపైన రికార్డ్ అవుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది.
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంవైపు తూర్ను, ఆగ్నేయదిశల నుంచి తీవ్రమైన గాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్లవాన పడే అవకాశం ఉందని వివరించింది. 15న మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
16న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని.. అలాగే 17 కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు పంట నష్టపోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
BRS: బీఆర్ఎస్లో ఇంఛార్జ్ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?
Rajamouly: జక్కన్నకే ‘ఆస్కార్’.. ది మాస్టర్ మైండ్.. అంతకుమించి..