CLAY POT:-ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర మానసిక ఆందోళన చెందుతుంటారు. ఇంట్లో ఎన్ని మార్పులు చేసినా సమస్యలు బయటపడలేకపోతుంటారు. అలాంటి వారు మట్టికుండ మేలు చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను పెట్టాలి. దీంతో శుభం కలుగుతుంది.
ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లోని అందరిపై వరుణ దేవుడి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో అందరికీ ఉండే భయాలు, అసౌకర్యాలు తొలగిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో మధ్య వయస్కులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
వరుణ దేవుడి దయంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుందట. అదేవిధంగా వారిలో ఉండే భయాందోళనలు తొలగిస్తుంది. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసుకునే బలం వారికి కలుగుతుంది. దీనివల్ల కుటుంబంలో ఉండే నడుమలో పుట్టిన కుమారుడికి లాభం చేకూరుతుంది. అందుకే ఉత్తరం దిశగా మంచినీటి మట్టికుండను పెట్టుకుని ఆ వరుణ దేవుని అనుగ్రహం పొందండి.