Mark Zuckerberg:- సోషల్ మీడియా అనేది ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వాట్సాప్లో ఉండే స్టేటస్ అప్డేట్స్, ఇన్స్ట్రాగ్రామ్లో ఉండే రీల్స్ లాంటి ఫీచర్స్ యూత్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. వారిని చూసి టీనేజర్లు కూడా ఈ సోషల్ మీడియా యాప్స్కు అడిక్ట్ అవుతున్నారు. అయితే టీనేజర్లు.. సోషల్ మీడియా వినియోగంపై జాగ్రత్తలు వహించాలని, ఆ బాధ్యతను యాజమాన్యమే నిర్వర్తించాలని యూఎస్ సెనేటర్స్ హెచ్చరించారు.
వర్చువల్ టెక్నాలజీకి ఈరోజుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలాగానే దీనికి కూడా యవతతో పాటు టీనేజర్లు కూడా అడిక్ట్ అవుతున్నారు. యూజర్లను అట్రాక్ట్ చేయడం కోసం వర్చువల్ టెక్నాలజీ మేకర్స్.. మెటావర్స్ అనే కొత్త లోకాన్నే సృష్టించారు. నిజ జీవితంలో చేసే ఎన్నో పనులను, చేయాలనుకొని చేయలేని పనులను మెటావర్స్లో చేయడానికి అవకాశం లభిస్తోంది. అయితే టీనేజర్లకు ఇందులో అనుమతి ఉండకూడదని అమెరికా ప్రభుత్వం కచ్చితంగా చెప్పింది.
మెటా ఫౌండర్, సీఈఓ అయిన మార్క్ జుకెర్బర్గ్ యూఎస్ సెనేటర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మెటావర్స్ అందరికీ అందుబాటులో ఉండగా.. టీనేజర్ల కోసం కూడా ప్రత్యేకంగా మెటావర్స్ను ఏర్పాటు చేయాలని మార్క్ సన్నాహాలు చేస్తున్నాడు. అయితే టీనేజర్ల కోసం మెటావర్స్ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉండడం మంచిది కాదని సెనేటర్లు తేల్చి చెప్పారు. త్వరలోనే 13 నుండి 17 వయసున్న వారికి మెటావర్స్ అందుబాటులో తేవాలనుకున్న మార్క్కు పెద్ద షాకే తగిలింది.
యూఎస్ సెనేటర్లు అయిన రిచార్డ్ బ్లూమెంథాల్, ఎడ్ మార్కే.. టీనేజర్ల కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెటావర్స్ ప్లాన్స్ను ఆపేయాలని మార్క్ను లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. సంస్థకు లాభం చేకూరడం కోసం ప్రమాదకరమైన టెక్నాలజీని టీనేజర్ల దృష్టికి తీసుకెళ్లడం మంచిది కాదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే మెటా ప్లాన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2022లో మెటా 13.7 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చూసింది. ఆ నష్టాన్ని లాభంగా మార్చడానికి మెటావర్స్ ఐడియాతో ముందుకొచ్చింది. ఇప్పుడు దీనికి కూడా బ్రేక్ పడనుంది.
Follow this link for more updates:- Bigtv