A Symbol Devotion:లక్ష్మీపాదాలు
లక్ష్మీ పాదాలను ఇంటి గోడలపై వేయడం చూస్తూంటాం. సకల శుభాలకి గుర్తుగా వేస్తారు. సీమంతం చేసిన స్త్రీ కాలిని కుంకుమపై అద్దించి ఆ పాదముద్రను ఇంటిలోపల పడేలా నడిపిస్తూ ఉంటారు.
స్వస్తిక్ గుర్తు
స్వస్తిక్ గుర్తు కూడా సకల శుభాల కోసమే. సూర్యదేవునికి ప్రతి రూపమంగా స్వస్తిక్ సింబల్ ను వేస్తారు ఈ గుర్తు వ్యాపార పుస్తకాల మీద , ఇంటి గోడలపైన వాహనాలపై కూడా ఇంకా అనేక వాటిపై రాసుకుంటారు
కమలం
కమలాన్ని హిందువుల పవిత్ర చిహ్నంగా భావిస్తారు. కమలం బురదలోనూ, ధూళిలోనూ ఉంటుంది.దానర్థం సమాజంలోని చెడూ, కుట్రలూ, కుతంత్రాలు, పగ ప్రతీకారాల మధ్య నివసిస్తున్నా వాటికి అతీతంగా స్వచ్చందంగా కమలం విరాజిల్లుతుందని పరమార్థం
పూర్ణకుంభం
గుడికి ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతుంటారు. పూర్ణ కుంభం క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత కలశంతో సమానం. సంపూర్ణ సుఖ జీవితాన్ని ఇవ్వమని వేడుకోవడమే పూర్ణకుంభ పూజ పరమార్థం
ఓంకారం
ఓంకారం సమస్త విశ్వాసానికి ప్రతిరూపంగా కొలుస్తారు. అందుకే అక్షరాభాస్యంలో తొలుతగా ఓం అని రాయిస్తారు.
తిలకదారణ
శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం. సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది