Akkineni:తెలుగు సినీ చరిత్రలో అక్కినేని ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టాలీవుడ్లో చాలా మంది నటులు, వారి వారసులు సినిమాలు చేస్తున్నారు. అయితే ఎవరికీ లేని క్రెడిట్ అక్కినేని కుటుంబానికి ఉంది. అదంటంటే మూడు తరాల నటీనటులు కలిసి మల్టీస్టారర్గా సినిమా చేయటం. కపూర్ ఫ్యామిలీ తర్వాత ఇండియాలోనే మూడు జనరేషన్స్ కలిసి నటించిన అరుదైన ఘనత అక్కినేని కుటుంబానిదే. వారందరూ కలిసి నటించిన చిత్రం మనం. దాని తర్వాత ఈ ఫ్యామిలీ హీరోలు మరో సినిమాలో కలిసి నటించలేదు.
అయితే త్వరలోనే అక్కినేని హీరోలు కలిసి మరో సినిమాలో నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలు. సమాచారం మేరకు.. ఇంతకు ముందు మనం చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. అందులో నాగేశ్వరరావు కీలక పాత్రలో నటిస్తే.. అఖిల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున, అఖిల్ కలిసి నటించబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన రాజా ఈ మల్టీస్టారర్ను డైరెక్ట్ చేస్తారట. రీసెంట్గా మోహన రాజా చెప్పిన కథ, నాగార్జునకి నచ్చింది. ఇప్పుడు మోహన రాజా స్క్రిప్ట్ పనులు ప్రారంభించారట.
ప్రస్తుతం నాగార్జున, బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అదొక మలయాళ రీమేక్. అది పూర్తయిన తర్వాత మోహన రాజా దర్శకత్వంలో సినిమాలో నాగార్జున, అఖిల్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. మరో వైపు అఖిల్ తన లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.
Pawan Kalyan: మేనల్లుడితో షూటింగ్ షురూ చేసిన పవన్ కళ్యాణ్