Balakrishna:- నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జనవరి 13న విడుదలై రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమా సక్సెస్ను బాలకృష్ణ సహా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా విజయోవత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ పాట పాడటం విశేషం. అప్పుడెప్పుడో హుదూద్ తుపాను వచ్చినప్పుడు టాలీవుడ్ నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాట పాడారు. అప్పట్లో అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి బాలకృష్ణ స్టేజ్పై పాట పాడారు. వీర సింహా రెడ్డి సక్సెస్ను బాలకృష్ణ ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారనటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అందరూ అంటున్నారు.
ఇప్పుడు కూడా బాలకృష్ణ పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీర సింహా రెడ్డి ఇప్పటికే రూ. 140 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. షేర్ వసూళ్ల ప్రకారం దాదాపు రూ.80 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు. శ్రుతీ హాసన్, హనీ రోజ్ ఇందులో హీరోయిన్స్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నెగిటివ్ టచ్ పాత్రల్లో నటించారు.
Follow this link for more updates:- Bigtv