E-Paper
Advertisement

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?
Advertisement

Balakrishna: బాలకృష్ణ అంటే సినిమాలు, డ్యాన్సులు, నరకడాలు, ఫ్యాక్షన్, పంచ్ డైలాగులు, అభిమానులను కొట్టడాలు.. ఇవే కావు. ఆయనలో మరో మనిషి ఉన్నాడు. మంచి మనిషి దాగున్నాడు. పెద్దలంటే గౌరవం.. పిల్లలపై ప్రేమ.. అభిమానులపై ఆప్యాయత.. అబ్బో సకల సుగుణాభిరాముడు మన బాలయ్య..అని ఆయన దగ్గరి వాళ్లు అంటుంటారు. కాకపోతే, కాస్త దూకుడెక్కువ. చేతికి, నోటికి కాస్త కంట్రోల్ తక్కువ. అలానే, ఇటీవల బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం తెలిసి.. బాలయ్య తనను మన్నించమని వేడుకున్నారు. తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి.. మంచి మనసును చాటుకున్నాడు.

దేవ బ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో తాను అలా మాట్లాడానని అన్నారు. ఎదుటివాళ్లను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

Advertisement

‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి బాధపడ్డా. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మరి, దేవాంగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇంతకీ దేవాంగుల గురించి బాలకృష్ణ ఏమన్నారంటే.. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ’

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×