Mahindra SUV Sales June 2024: దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో అంటే జూన్ 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. మహీంద్రా మరోసారి భారతదేశపు అతిపెద్ద SUV సేల్ కంపెనీగా అవతరించింది. మహీంద్రా గత నెలలో 23 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 40,022 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను డెలివరీ చేసింది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో మహీంద్రా కేవలం SUVలను మాత్రమే విక్రయిస్తుంది.
అయితే మహీంద్రా కంపెనీ సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే జూన్ 2023లో, మహీంద్రా మొత్తం 32,588 యూనిట్ల SUVలను విక్రయించింది. మహీంద్రా మే 2024లో మొత్తం 43,218 యూనిట్ల SUVల అమ్మకాలు జరిపింది. మహీంద్రా స్కార్పియో, XUV 700, XUV 3X0, బొలెరో ఈ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలు.
Also Read: స్టైలిష్ లుక్స్తో అదరిపోయే బైకులు.. కేకపెట్టిస్తున్న డిజైన్, మైలేజ్!
అలానే మరోవైపు మహీంద్రా గత నెలలో మొత్తం 2,597 యూనిట్ల SUVలను ఎగుమతి చేసింది. ఈ ఎగుమతి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే జూన్ 2023 కంటే 4 శాతం ఎక్కువ వృద్ధిని సాధించింది. ఇటీవల మహీంద్రా XUV 700 భారతదేశంలో 2 లక్షల కంటే ఎక్కువ యూనిట్ల SUV ఉత్పత్తి సంఖ్యను అధిగమించిందని కంపెనీ వెల్లడించింది.
కంపెనీ 2021 సంవత్సరంలో మహీంద్రా XUV 700ని విడుదల చేసింది. కుటుంబ సెఫ్టీ కోసం జరిగిన క్రాష్ టెస్ట్లో గ్లోబల్ NCAP మహీంద్రా XUV 700కి 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత మార్కెట్లో మహీంద్రా XUV 700 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 13.99 లక్షల నుండి రూ. 26.99 లక్షల వరకు ఉంటుంది.
Also Read: వేలానికి హీరో కొత్త బైక్.. 100 మందికి మాత్రమే ఛాన్స్!
మహీంద్రా XUV 3X0 చాలా వేగంగా అమ్ముడవుతోంది. కంపెనీ ఇటీవల తన అప్డేటెడ్ మహీంద్రాను విడుదల చేసింది. కంపెనీ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్లతో పోటీపడే ఈ SUV మే 2024లో మొత్తం 10,000 యూనిట్ల SUVలను విక్రయించింది. ఈ SUVలో మీరు పెట్రోల్ డీజిల్ రెండింటినీ కలిగి ఉన్న పవర్ట్రెయిన్గా మూడు ఇంజన్లు చూస్తారు. భారత మార్కెట్లో మహీంద్రా XUV 3X0 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.49 లక్షలుగా ఉంటుంది.