ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుకుని అధికారులు.. రెండు గోడౌన్లను సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టును ద్వారంపూడి.. తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.
Also Read: ప్రభుత్వ శ్వేతపత్రం విడుదలతో వైసీపీలో కలవరం.. అంబటి అర్థంలేని ఎదురుదాడి
తనిఖీలు పూర్తి అయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు. రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖ సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయి పరిశీలన జరిపాక.. సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు.