Bihar Girl Safe from Lightning Strikes while Making Reels: వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తారు. ఎందుకంటే సడన్గా పిడుగులు పడతాయి. వాటిని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చెట్ల కింద ఉండవద్దని పదేపదే చెబుతారు. పిడుగుల నుంచి మనుషులు తప్పించుకు న్న సందర్భాలు పెద్దగా లేవు. ఉందంటే అది రేర్.
ఇందుకు ఎగ్జాంపుల్ బీహార్లోని బాలిక వ్యవహారం. అసలేం జరిగిందన్న డీటేల్స్లోకి వెళ్తే.. బీహార్లోని సీతాహర్హిలో బుధవారం సాయంత్రం జోరుగా వర్షం పడింది. చాన్నాళ్లు తర్వాత వర్షం పడడంతో కొంతమంది ఔత్సాహికులు ఇన్స్టా రీల్స్ చేశారు.
కాస్త వర్షం తగ్గడంతో మంచి వాతావరణంలో రీల్స్ కోసం పక్కనున్న బిల్డింగ్ టెర్రస్పైకి ఎక్కింది సానియా కుమారి అనే బాలిక. వర్షంలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈలోగా భారీ శబ్దంతో బాలికకు సమీపం లో పెద్ద పిడుగు పడింది. అదృష్టవశాత్తూ బాలికకు ఎలాంటి ప్రమాదం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలికకు ఇంకా ఆయుష్షు వుందని అంటున్నారు.
Also Read: Metro Viral Video: ఎగ్జామ్లో కాపీ కొట్టేందుకు మెట్రోలో కూర్చుని స్లిప్ ప్రిపేర్ చేసుకున్న యువతి
Reels nahi rukni chahiye.💃🙂
📍Sitamarhi, Bihar#LighteningStrike #Thunder ⚡🌩️ pic.twitter.com/9b1i9YDzNo— NITESH (@Nitesh805181) June 26, 2024