Janhvi Kapoor Ramp Walk at Paris Fashion Week: హీరోయిన్ జాన్వీకపూర్ తక్కువ సినిమాలతో బాలీవుడ్లో ఫేమస్ అయ్యింది. తొలిసారి ధడక్ మూవీతో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు, ఇక వెనుదిరిగి చూడలేదు.
రకరకాల రోల్స్ చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేకాదు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచేసుకుంది.
సోషల్మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది ఈ అతిలోక సుందరి. అప్పుడప్పుడు ఫిల్మ్ బేస్డ్ ఫంక్షన్లకు అటెండవుతోంది. ఈ మధ్య దక్షిణాదిపై దృష్టి పెట్టుకుంది.
ఈ ఏడాది ఇయర్ చార్ట్ ఫుల్ చేసుకున్న ఈ అమ్మడు, పనిలోపనిగా వచ్చే ఏడాది కూడా బిజీ అయ్యే పనిలో నిమగ్నమైంది.
పారిస్ ష్యాషన్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ర్యాంప్పై హీరోయిన్లు అందాలు ఆరబోయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు.
ఒక్కసారి పారిస్ ఫ్యాషన్ ర్యాంప్లో నడిస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా మాంచి క్రేజ్ వస్తుంది. అంతేకాదు అక్కడి హాలీవుడ్ చిత్ర ప్రముఖులు కూడా హాజరవుతారు. వారి కంట పడేందుకు అతిలోక సుందరి మాదిరిగా తయారవుతారు.
తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్లో సందడి చేసింది. బ్లాక్- బ్లూ కలగలిపిన డ్రెస్ ధరించి ర్యాంప్పై హోయ లొలికిస్తూ క్యాట్ వాక్ చేసింది. ఇండియాలో చాలామంది బ్యూటీలు అక్కడికి వెళ్లారు. వారందరి కంటే అందరిచూపు ఈ సుందరిపై పడింది.
ఎవరు ఈ అతిలోక సుందరి అంటూ చర్చించుకోవడం అక్కడికి వచ్చిన ఫ్యాషన్ ప్రియుల వంతైంది. ఆకాశం నుంచి దిగివచ్చిన సుందరి మాదిరిగా ఉందంటూ చర్చించుకోవడం కనిపించింది.
దివంగత అలనాటి అందాల తార శ్రీదేవిని మరపించిందని చెప్పుకోవడం కొసమెరుపు. శ్రీదేవి తనయగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వికపూర్. ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మహి ఫిల్మ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె నటించిన Ulajh మూవీ ఆగస్టు రెండున గ్రాండ్గా విడుదల కానుంది. ఇదికాకుండా జూనియర్ ఎన్టీఆర్తో నటిస్తున్న దేవర, రామ్ చరణ్తో మరో మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.