Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ప్రభుత్వం గురించి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇక ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
గన్నవరం పిల్లి ఏమైందని వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు.. కొడాలి నాని, వంశీకి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీలో ఉంటే ఎవరైనా హీరోలే అని అన్నారు. బయటకు వెళ్తే జీరోలు అని విమర్శించారు. అసలు రిషికొండ ప్యాలెస్లు ఎందుకూ.. అని ప్రశ్నించారు. జగన్ ఫర్నీచర్ దొంగ అని అన్నారు.
Also Read: అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
తాడేపల్లిలో గురువారం జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమీవేశంలో పాల్లొన్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రుషికొండలోని భవనాలు జగన్ నివాసాల కోసమే నిర్మించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాక్లను జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ జగన్కు లేదన్నారు.