Minister Kandula Durgesh : బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో మెగాస్టార్ తో మరోసారి త్రిష జత కడుతుండగా.. ఖుష్బూ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విశ్వంభర సెట్స్ కు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెళ్లారు. అక్కడ షూటింగ్ లో ఉన్న చిరంజీవిని మర్యాదపూర్వంగా పలుకరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలను X లో ట్వీట్ చేశారు. “మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు.”
“తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.
మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024