AP Intermediate Advanced Supplementary Results 2024 : ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://resultsbie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. కాగా.. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది.
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.. 10,53,435 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది, సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 12న ఏపీ విద్యాశాఖ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది.