Trivikram Family Visit Tirumala on Foot: టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే మొదటిసారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు కాలినడకన వచ్చారు. రాత్రి తిరుమలలో బస చేసిన ఆయన.. ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతోపాటు సతీమణి సౌజన్య, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కోసమేనా.. ఇదే హాట్ టాపిక్..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ విజయం సాధించడంతోపాటు డిప్యూటీ సీఎం పదవి వరించడం.. త్రివిక్రమ్ అకస్మాత్తుగా కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వంటి విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా సినిమా పరిశ్రమ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ కావడం లేదా సక్సెస్ అయితే శ్రీవారిని దర్శించుకుంటారు. కానీ త్రివిక్రమ్ సడెన్గా తిరుమలకు కాలినడకన రావడం.. పవన్ కోసమే అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. కానీ మరోవైపు త్రివిక్రమ్ ఫ్యామిలీ రావడంతో దర్శించుకున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Also Read: స్టార్ హీరో దర్శన్ అరెస్టు.. మనస్థాపంతో అభిమాని ఆత్మహత్య..!
ప్రతీ మాట వెనుక ఆయనే..
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రతీ మాట వెనుక త్రివిక్రమ్ కష్టం ఉంది. తన స్నేహితుడు పవన్ కల్యాణ్ కోసం అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేసి పవన్ కల్యాణ్ గెలుపు కోసం త్రివిక్రమ్ అండగా నిలిచారు. ఇలా పవన్ విజయం వెనుక త్రివిక్రమ్ కీలక భూమిక పోషించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల పవన్ ఓడిపోయారు. కానీ ఈసారి పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి వరించింది.
Director #Trivikram along with his wife #SoujanyaSrinivas & son #Rishie went to Tirumala through Alipiri walk way to take the divine blessings of Lord Venkateshwara! 🙏✨#Tollywood #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/kQ3v0SyFHF
— Telugu FilmNagar (@telugufilmnagar) June 18, 2024