Viral Video: పెళ్లిళ్ల సీజన్ అయినా కాకపోయినా దానికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. తరచూ వైరల్ అయ్యే ఇలాంటి వీడియోలు ఎప్పుడూ అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఉంటాయి. కొన్ని సన్నివేశాలు చూస్తే అసలు నవ్వు ఆపుకోలేనంతా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులు ఏకంగా పెళ్లి వేదికను రంగస్థలంగా మార్చేశారు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ చూసి అతిథులు కూడా తలలు పట్టుకున్నారు. అసలు ఆ వీడియో ఏంటి, ఎందుకు గొడవ జరిగిందో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జయమాల కోసం వధూవరులు వేదికపై ఎదరుచూస్తున్నారు. ఈ తరుణంలో వరుడు తన వధువుకు స్వీట్లు తినిపించడానికి దగ్గరికి వస్తాడు. అయితే పెళ్లికూతురు మానసిక స్థితి బాగోలేదని, స్వీట్లు తినాలనే కోరిక కూడా లేదు. ఇక మరోవైపు వరుడు కూడా మిఠాయిలు అందించడంలో మొండిగా ప్రవర్తించాడు. అతను బలవంతం చేయడంతో పెళ్లికూతురికి కోపం వచ్చింది. అనంతరం జరిగిన తోపులాటలో వధువు అతన్ని చెంపదెబ్బ కొట్టింది. తనపైకి కోపంతో వస్తున్న వధువును చూసి వరుడికి కూడా కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య జరిగిన ఈ సన్నివేశం కాస్త గొడవకు దారితీసింది.
వధువు, వరుడి మధ్య మొదలైన గొడవ తీవ్రతరం కావడంతో బంధువులు, తల్లిదండ్రులు అంతా కలిసి ఆపేందుకు ప్రయత్నించారు. అయినా కూడా వారు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేకపోయింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోను తీసి బంధువులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022