Malla Reddy Hostel Food: మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదో విధంగా వార్తల్లోకి వస్తోంది. దీనికితోడు యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా మరోసారి ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు.
యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి స్టూడెంట్స్ నాయకులు ధర్నా చేశారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరుపై స్టూడెంట్స్ మండిపడుతున్నారు. విద్యార్థు లకు పెడుతున్న ఆహారంలో బొద్దింకలు పడుతున్నా యాజమాన్యం సైలెంట్గా ఉండటాన్ని తప్పుబడు తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా విద్యార్థులు ఫుడ్ విషయంలో ఆందోళన చేశారు. యాజమాన్యం పట్టించుకున్న సందర్భం లేదు.
Also Read: తెలంగాణ కోటా ఎంత? కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి?
హాస్టల్ ఇన్ఛార్జ్ని నిలదీశారు విద్యార్థులు. అంతకుముందు మల్లారెడ్డి కాలేజీ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. ఫుడ్ విషయంలో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆందోళన
మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో
మరో సారి ఆహారంలో పురుగులు వచ్చాయి అంటూ విద్యార్థుల ఆందోళన. నిన్న రాత్రి తినే భోజనంలో పురుగులు ఉన్నాయంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు. యూనివర్సిటీ ముందు బైఠాయించి విద్యార్థుల… pic.twitter.com/o3Z8MSDlOA— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2024