Samsung భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్ Samsung Galaxy M55sని రిలీజ్ చేసింది.
ఈ స్మార్ట్ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 ధరలో అందుబాటులో ఉంది.
దీంతో పాటు మరో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. కానీ వాటి ధరలు కంపెనీ వెల్లడించలేదు.
ఈ నెల అంటే సెప్టెంబర్ 26 నుండి ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ సహా Samsung వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది.
భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. SBI క్రెడిట్ కార్డ్పై రూ. 2,000 తక్షణ తగ్గింపు పొందచ్చు.
ఈ స్మార్ట్ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2400×1080 పిక్సెల్ల పూర్తి HD ప్లస్ రిజల్యూషన్తో వచ్చింది.
ఈ స్మార్ట్ఫోన్ 120 Hz వరకు రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. అలాగే 1000 పీక్ నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది.
ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ని కలిగి ఉంది. Adreno 644 GPU దానితో వచ్చింది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది.
అదే సమయంలో 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh పెద్ద బ్యాటరీ అందించబడింది.