‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తుంది.
రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.298.5 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టేసింది
ఈ మూవీ సక్సెస్తో తాజాగా నిర్మాత అశ్వినీదత్ సెకండ్ పార్ట్పై క్రేజీ కామెంట్స్ చేశారు.
ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన అశ్వినీదత్ ఆసక్తికర అప్డేట్ను అందించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ చేశారు.
‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికీ సగం పూర్తయిందని చెప్పుకొచ్చారు.
అలాగే మూడువేల అడుగుల పుటేజ్ తమ దగ్గర ఉందని.. రిలీజ్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని తెలిపారు.
ఒకవేళ రిలీజ్ చేయాల్సి వస్తే.. వచ్చే ఏడాది ఇదే టైంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కల్కి సినిమాటిక్ యూనివర్స్ గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు.
అయితే ఈ చిత్రం నుంచి ప్రస్తుతానికి రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.
రెండో పార్ట్ తర్వత సినిమాటిక్ యూనివర్స్ గురించి పూర్తి బాధ్యత దర్శకుడు నాగ్ అశ్విన్కే వదిలేస్తున్నానని అన్నారు.
ప్రస్తుతం అశ్వినీదత్ కామెంట్స్ ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.