లోక్ సభ ఎన్నికలు.. బీజేపీలో సినీతారలు

వెండి తెరపై మెరిసిన చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున కొందరు నటీనటులు ఎంపీస్థానాల్లో పోటీ చేస్తున్నారు. వారెవరో చూసేద్దాం..

కంగనా రనౌత్ బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపుపొందిన కంగనా.. ఈ మధ్యే బీజేపీలో చేరారు. లోక్ సభ ఎలక్షన్స్ లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నారు.

నవనీత్ రాణా ఒకప్పటి  టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ రాణా ..ఈ మధ్యే బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరుపున బరిలోకి దిగనున్నారు.

హేమమాలిని బీజేపీలో సీనియర్ నాయకురాలు. ఉత్తర ప్రదేశ్ లోని మథుర నుంచి మూడోసారి ఎంపీగా పోటీకి దిగుతున్నారు. 2014, 2019 లోనూ ఈమె ఆ స్థానం నుంచే  పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్ కి ప్రయత్నిస్తున్నారు.

స్మృతి ఇరాని బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి.. బీజేపీలో కీలక నేతగా మారారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుంచి పోటీ చేస్తున్నారు.

సురేశ్ గోపి కోలీవుడ్ స్టార్ నటుడు సురేశ్ గోపి చాలా కాలంగా బీజేపీలో ఉన్నారు. 2019లో త్రిస్సూర్  లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానంలో పోటీకి దిగుతున్నారు.

రవి కిషన్ భోజ్ పురి నటుడు, రేసు గుర్రం మూవీలో నటించాడు. 2019 లో గోరఖ్ పుర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా అదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

సుమలత కర్ణాటక లోని మాండ్య నియోజకవర్గం స్వతంత్ర ఎంపీ, నటి సుమలత కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరుపున సీటు కోరినా.. పొత్తులో భాగంగా అది జేడీఎస్ నేత కుమారస్వామికి దక్కింది. ఆయనకు మద్దతు ఇస్తానని ఆమె పేర్కొన్నారు.