టెక్ బ్రాండ్ Infinix నుంచి కొత్త స్మార్ట్ఫోన్ Infinix Note 40X 5G భారతదేశంలో లాంచ్ అయింది.
ఇది రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8GB + 256GB వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది.
అలాగే 12 GB + 256GB వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Note 40X 5Gని ఆగస్ట్ 9 నుండి ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయవచ్చు. ఇది రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త స్మార్ట్ఫోన్ మల్టీగ్రేడియంట్ ఫినిషింగ్తో లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ 6.78 FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 60, 90, 120Hz వరకు రిఫ్రెష్ రేట్లకు మద్దతు ఇస్తుంది.
108MP AI ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. కెమెరా యాప్ 15 కంటే ఎక్కువ మోడ్లను సపోర్ట్ చేస్తుంది.
ముందు భాగంలో ఇది 8 మెగాపిక్సెల్స్, వైడ్ సెల్ఫీ మోడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
ఇందులో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. ఇది గరిష్టంగా 12 GB RAM + 256 GB స్టోరేజ్ను కలిగి ఉంది.
ఇది 18-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఇందులో డ్యూయల్ స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, ఫేస్ అన్లాక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.