తెలుగులో సినిమా స్క్రీన్పై వెలిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ ఎవరో తెలుసా?
నందమూరి తారకరామారావు: 1983లో టీడీపీని స్థాపించి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఏపీ సీఎం అయ్యారు.
చిరంజీవి: 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్లారు.
నందమూరి బాలకృష్ణ: మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పవన్ కల్యాణ్: 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్..2024లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
మోహన్ బాబు: టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేసిన ఆయన..వైసీపీలో చేరారు.
మురళీ మోహన్ : టీడీపీ నుంచి ఎంపీ గెలిచాడు.
బాబు మోహన్: టీడీపీ నుంచి మంత్రిగా. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
విజయశాంతి : 2009లో 'తల్లి తెలంగాణ' అనే పార్టీని స్థాపించారు.
రోజా: రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జయసుధ: కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరారు.