ధ్యానం  చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి, భయాలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు దరి చేరదు

ధ్యానం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది.

ధ్యానంతో శరీరంలో కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ధ్యాన సాధన చేస్తే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. మనోవైకల్యం, గుండె జబ్బులు రావు.

ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. జ్ఞానం బోధపడుతుంది. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలుగుతారు.

ధ్యానం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లభిస్తుంది. కోపాన్ని అదుపు చేసుకోవచ్చు.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే.. తప్పనిసరిగా ధ్యానం చేయాలని పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిముషాల పాటు ప్రతి రోజు ఉదయం ధ్యానం చేయండి.