Viral News: సోషల్ మీడియాను కేవలం సరదా, సంతోషాలకు మాత్రమే కాదండోయ్ ఫిర్యాదులకు కూడా తెగ వాడేసుకుంటున్నారు. వినియోగదారులు తీసుకునే వస్తువులపై సంస్థలు స్పందించకపోతే సోషల్ మీడియాలను వాడుకుంటున్నారు. నెట్టింట పోస్టులు చేస్తూ తమ సమస్యలను వివరిస్తున్నారు. ఒకవేళ తమ సమస్యపై సంస్థలు స్పందించకపోతే దానిని కూడా పోస్ట్ ద్వారా తెలియజేస్తున్నారు. దీంతో ఆ సంస్థలపై విమర్శలు తలెత్తడంతో సంస్థ స్పందించి వినియోగదారుల సమస్యను తీర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే
ఏ వస్తువు కొన్నా సరే ప్రస్తుతం ఉన్న వెసులుబాటుతో ఆ వస్తువు నచ్చకపోతే వెంటనే వాటిపై ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకునే రోజులు వచ్చాయి. కస్టమర్లు తమ ప్రొడక్ట్ తో తృప్తి చెందకపోతే వెంటనే దానిపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ తరుణంలో వాటిపై స్పందించకపోతే వినూత్నంగా నిరసన చేస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి ఓలా సంస్థపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తనకు వచ్చిన సమస్యపై సంస్థ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై నిరసన చేయాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో ఓలా సంస్థ నుంచి తాను కొనుగోలు చేసిన బైక్ రిపేర్ జరిగితే దానికి మరమ్మత్తులు చేయడానికి సంస్థ ముందుకు రావడం లేదని తెలిపింది. తాను కొనుగోలు చేసిన తర్వాత ఓలా బైక్ పదే పదే పాడవుతుందని తెలిపింది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా సంస్థ మాత్రం స్పందించడం లేదని నెట్టింట పోస్ట్ చేసింది. దీనిపై నిరసన తెలుపుతూ తన ఆవేదను తెలిపింది. తన ఓలా బైక్ పై ఓ కాగితంపై తన సమస్యను రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోస్ట్ కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. దీంతో వెంటనే ఓలా సంస్థ దీనిపై స్పందిస్తూ వాహనాన్ని రిపేర్ చేసేందుకు ఒప్పుకుంది. అంతేకాదు రిపేర్ చేసే సమయంలో యువతికి మరొక బైక్ వాడుకోవాలని అందించింది. కాగా, యువతి చేసిన నిరసన మాత్రం తెగ వైరల్ అవుతోంది.
“Ola ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಮ ಜೀವನ ಗೋಳು “
I will Be Spreading Awareness Against Ola Electric 😁🤌🏻
Thanks For The Idea @UppinaKai Sir 🫡 #DontBuyOla#OlaElectric pic.twitter.com/bcVQ3i6P3K— ನಿಶಾ ಗೌರಿ 💛❤ (@Nisha_gowru) September 12, 2024