Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వినూత్న వీడియోలు చేసే వారి గురించే కాకుండా సాధారణంగా ప్రకృతిలో జరిగే చాలా రకాల సన్నివేశాలు అందరినీ ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా ఇందులో ఏవైనా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు అయితే హల్ చల్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి సంఘటనలు బయట చూస్తే ఎక్కువ ఆశ్చర్యం కలిగించకపోయినా కూడా సోషల్ మీడియా మాత్రం ఇలాంటి వీడియోలను ఫేమస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దృశ్యాల్లో ఏదో ఒక పాయింట్లో దాని అర్ధాన్ని తెలియజేస్తూ అందరినీ ఆలోచింపజేస్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కాకులు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే పక్షులను చూస్తుంటే వాటిలా మనకు కూడా రెక్కలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే వాటిలా ఆకాశంలో ఎంతో హాయిగా ఎగిరే అవకాశం ఉండేది అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కాకులకు రెక్కలు ఉన్నా కూడా అవి సోమరితనం పాటించాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సుపై కాకుల గుంపు దర్శనమిచ్చింది.
కాకులు సాధారణంగా ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి. కానీ ఈ కాకులు మాత్రం బస్సుపై కూర్చుని ప్రయాణం చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా కాకుల గుంపే బస్సుపై ప్రయాణం చేయడం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో రోడ్డుపై ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో హల్ చల్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు అసలు కాకులు గాల్లో ఎగరాల్సింది పోయి హాయిగా ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మనుషుల మాదిరే కాకులు కూడా సోమరితనం పాటిస్తున్నాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
where are they going pic.twitter.com/cqe1YqkOT3
— k (@krownnist) July 16, 2024