10th Pass: ఇది ఒకప్పటి కాలం కాదు. ఇప్పుడు ఏం జరిగినా అది ఒక ట్రెండ్ అన్నమాటే. నిజం చెప్పాలంటే అప్పటి కాలంలో పదోతరగతి పాస్ అయినా అదొక గొప్ప విజయం అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఏకంగా గ్రాడ్యుయేట్లే అవుతున్నారు. అమెరికా, న్యూయార్క్, లండన్ వంటి విదేశాల్లో చదువుతా పట్టాలు పొందుతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఈ కాలంలోను పదోతరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా పట్టించుకోకుండా ఉండే రోజుల్లో ఓ వ్యక్తి టెన్త్ పాస్ అయ్యాడని తన కుటుంబం ఏకంగా పండుగ చేసుకుంది.
తాజాగా మహారాష్ట్రలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. 10 సార్లు పదోతరగతి పాస్ అవ్వాలని ప్రయత్నించి ఓడిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పదకొండో సారి పాస్ అవ్వడం ఆ కుటుంబాన్ని సంతోషపరిచింది. దీంతో ఏకంగా ఊరేగింపుతోనే ఇంటికి ఆహ్వానం పలికారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీడ్లోని పర్లీ గ్రామానికి చెందిన కృష్ణనామ్దేవ్ ముండే ఈ ఘనత సాధించాడు. అతడు 2018లో పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 10 సార్లు పరీక్ష రాశాడు. అయినా పాస్ అవ్వలేదు. కానీ పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు.
తాజాగా రాసిన పరీక్షల్లో పాస్ అవడంతో ఏకంగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఊరేగింపుతో తీసుకెళ్లారు. మెళ తాళాల మధ్య పూల మాల వేసి మరి స్వాగతం పలికారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు.. బ్యాండు మేళంతో ఊరేగించిన గ్రామస్థులు
మహారాష్ట్ర – బీడ్కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు.
దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. pic.twitter.com/rDZ5AvMlbp
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024