Train Video: ఇటీవల సోషల్ మీడియాలో తరచూ రైలుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. రైలులో ప్రయాణించడానికి స్థలం లేకుండా ఇరుకుగా ప్రయాణించడం, లేకపోతే ట్రైన్ డోరు వద్ద ఊగులాడుతూ ప్రయాణించడం వంటి వీడియోలు తరచూ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
కొంతమంది ప్రయాణికులు రైలులో స్థలం లేక రైలు పైన ఎక్కి ప్రయాణించారు. అయితే ఇప్పటికే సెల్పీల పిచ్చితో రైలుపైన ఎక్కి విన్యాసాలు చేయడం, రైలులో డోర్ల వద్ద నిల్చుని సాహసాలు ప్రదర్శించడం మూలంగా ఎన్నో దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా మరోసారి ఇటువంటి తరహాలోనే మరో ఘటన వెలుగుచూడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
రైలులో స్థలం లేదని ఏకంగా రైలుపైకి ఎక్కి మరి కొంత మంది ప్రయాణికులు ప్రయాణించారు. అయితే రైలు ఎంతో వేగంగా వెళుతూ ఉంటుంది. ఈ తరుణంలో వారు రైలుపైకి ఎక్కి దానిపై పడుకుని మరి ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంలే రైలుపై ప్రయాణికులు ప్రయాణించడం ఓ వింత అయితే ఇందులో ఇద్దరు ప్రేమికుల జంట ఏకంగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని మరి పడుకుని ప్రయాణించారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది.
मजबुरी होगी नहीं तो इतना रिस्क कोई नहीं लेता हैं। pic.twitter.com/54X3NIekZX
— Hansraj Meena (@HansrajMeena) June 9, 2024