Viral Video: నేడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి కూడా. ప్రతీ ఏడాది ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు.
గిడుగు రామ్మూర్తి తెలుగు భాష పట్ల చేసిన సేవలను ఉద్దేశించి ప్రతీ ఏడాది తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాదు తెలుగు భాష శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో దేశ బాషలందు తెలుగు లెస్స అని చెప్పి అప్పుడే తెలుగు భాషను చాటాడు. తెలుగు బాషను మూలం ద్రవిడ భాష కావడంతో ఏపీ అధికారిక భాష చట్టం ప్రకారం 1966వ సంవత్సరంలో తెలుగు భాషను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే నేడు కేవలం తెలుగు భాషా దినోత్సవం మాత్రమే కాదు, నేషనల్ స్పోర్ట్ డే కూడా. అయితే ఈ వేడుకల సందర్భంగా తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారి చిత్రానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రాలను ఒకే ఫ్రేమ్లో కుప్పం కళాకారుడు పురుషోత్తం చిత్రీకరించాడు. ఫ్లోర్ పై కలర్ ముగ్గులతో ఇద్దరి చిత్రాలను గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో అద్భుతంగా పురుషోత్తం ఇద్దరి చిత్రాలను గీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.
తెలుగు భాషా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రాలను ఒకే ఫ్రేమ్లో చిత్రీకరించిన కుప్పం కళాకారుడు పురుషోత్తం.#Painting #Kuppam #AndhraPradesh #NewsUpdates #Bigtv pic.twitter.com/NbNCa85Pyy
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2024