Viral Video: తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణానికి సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులోను రైలు ప్రయాణంకు సంబంధించిన వీడియోలు అందిరినీ ఆకట్టుకుంటాయి. భారత దేశంలో రైలు ప్రయాణం అంటే అదొక సాహసం అనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో నడిచే రైలు ప్రయాణాల్లో ప్రయాణించాలంటేనే అందరికీ భయం పుట్టిస్తుంది. కనీసం కాలు కూడా పెట్టడానికి స్థలం లేకుండా ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో అసలు రైలులో ప్రయాణం చేయడం కంటే ఎక్కడి వెళ్లకుండా ఉంటేనే మేలు అనిపిస్తుంది.
సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే భయంకరంగా ఉంటుంది. సీటు కాదు కదా నిల్చోవడానికి కూడా స్థలం లేకుండా ఉంటుంది. అయితే అందులోను పండుగ సీజన్ వస్తే చాలు అస్సలు డోరుకు వేలాడుతూ మరీ ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ అనుభవించే వారు వీటిని భరించలేక కొన్ని వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వెలుగుచూశాయి. అయితే తాజాగా ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఓ వ్యక్తి జనరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ తరుణంలో ప్రయాణంలో భాగంగా అసలు తనకి నిల్చోని ప్రయాణం చేయడానికి కూడా స్థలం లేకుండా పోయింది. ఈ తరుణంలో ఓ ఐడియాతోనే ప్రయాణం చేసేందుకు వచ్చాడు. అసలు నిల్చోవడానికి కూడా స్థలం లేని చోట పడుకోవడానికి స్థలం ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. రెండు సీట్ల మధ్యలో దర్జాగా ఊయల కట్టుకుని పడుకున్నాడు. ఈ తరుణంలో రెండు పైన సీట్లకు మధ్యలో ఓ బెడ్ షీట్ ను కట్టాడు. ఆ బెడ్ షీట్లో ఎం చక్కా నిద్రపోయాడు. ఆ రైలులోనే ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులు దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఐడియా మాకు రాలేదేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ ఈ సారి ప్రయాణంలో ఈ ఐడియా వాడుకుంటా అంటూ కామెంట్ చేస్తున్నారు.
India me talent ki kami nhi hai………….
Gajab ke log hai yarr…. 🤣🤣😂😂😂😂 pic.twitter.com/NyQxor0k7I
— Payal ❣️ (@Chalbe__) September 25, 2024