Elephant Playing With Foot Ball with Basketball: ఏనుగుల చూడటానికి చాలా పెద్దవిగా, బద్ధకంగా ఉంటాయి. వాటిచేష్టలు చూస్తే కొన్నిసార్లు నవ్వకుండా ఉండలేము. సాధారణంగా ఏనుగులు భోజన ప్రియులు. ఇవి పండ్లను అమితంగా ఇష్టపడతాయి. కానీ ఏదైనా పండ్లను వీటికి తినిపిస్తే నిదానంగా ఓపికగా తింటుంటాయి. ఏనుగులు అడవిలో ఉండేవి అయితే.. మనుషులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇటువంటి ఘటనలు చెప్పుకోవాలంటే బోలేడు ఉన్నాయి. ఇక “జూ”లో ఉండే వాటినైతే మావటివారు కంట్రోట్ చేస్తుంటారు. మానటివారు లేకుండా ఏనుగు ఉందంటే అది చేసే రచ్చ అంతా ఇంత కాదు.
అయితే ఇటీవల ఏనుగులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తున్నాయి. అవి దాడులు చేసినవి, ఆటలాడే వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కోడుతుంటాయి. అటువంటి వీడియోనే తాజాగా ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. ఆ వీడియో ఎంటో చూసేద్దాం..
బంతితో ఏనుగు ఆటలు pic.twitter.com/4pfSlf1nAC
— viral videos (@video71692) March 5, 2024
READ MORE: రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి
గువహతిలోని నారంగి సమీపంలో ఉన్న సాట్గావ్ ఆర్మీ క్యాంపులో కొందరు యువకులు బాస్కెట్బాల్ అడుతున్నారు. ఈ సమయంగా ఓ ఏనుగు ఒక్కసారిగా ప్రవేశించింది. దారిపై పడిన బంతిని తన తొండతో పట్టుకొని వెళ్లింది. దీంతో బాల్ తమకు ఇవ్వాలని అక్కడి యువకులు గట్టిగా అరిచి కేకలు వేశారు.
ఏనుగు మాత్రం అవేం పట్టనట్లుగా బంతి పట్టుకొని వెల్లిపోయింది. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది దాడి చేయకుండా బాలుతో ఆడుకుంటూ వెల్లడం. ఆ యువకులను వదిలిందంటే అదృష్టమనే చెప్పాలి.ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏనుగు బంతాట చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.
కేరళలకు చెందిన ఓ కుటుంబం ఊటీకి వెళ్తోంది. ఈ క్రమంలో ముతుంగ అటవీ ప్రాంతంలో ఏనుగు కనబడితే కారు ఆపి ఫొటోలు తీసేందుకు ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. అయితే వారిపై అది దాడి చేస్తుందని ఊహించలేదు. ఒక్కసారిగా ఏనుగు వారి వెంట పరిగెత్తడంతో హడలిపోయారు. ఏం చేయాలో తోచక అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
READ MORE: ఆకులు తింటున్న సింహం.. వైరల్ వీడియో!
ఏనుగు కూడా అంతే వేగంగా పరుగుపెట్టడందో ఏం చేయాలో అర్ధం కాలేదు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. వెంటనే ఏనుగు వెనక్కి తిరిగి కాళ్లతో తొక్కేందుకు ప్రయత్నించి వదిలేసింది. దీంతో సదరు వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఏనుగులు చాలా క్రూరంగా ఉంటాయి. అటవీ ప్రాంతంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వదిలిపెట్టవు. ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లుగా భావిస్తాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ పిచ్చిలో పడిన జనాలు ఈ ఫోటోల పిచ్చిని పక్కనబెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. ఏనుగులు వాటికి అడ్డోచ్చిన వేటినైనా వాటి పాదంతో తొక్కి చంపుతాయి. మరికొన్నైతే తోండంతో దాడి చేస్తాయి. ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి.