Viral Video: టెక్నాలజీ రానురాను మరింత పెరిగిపోతుంది. చిన్న పని చేయడానికి కూడా శ్రమించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇప్పటికే షాపింగ్, ఫుడ్, గ్రాసెరీస్, ట్రావెల్ అంటూ చాలా రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కేవలం ఫోన్లో నుంచి ఒక్క నొక్కు నొక్కితే చాలు క్షణాల్లో అయిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే మరింత ముందుకు వెళ్లింది. ఒకప్పుడు ఎవరి ఇంట్లో చూసినా కూడా డబ్బులు కట్టలు కట్టలు ఉండేవి. అదే ఇప్పుడు మాత్రం ఫోన్లోని అకౌంట్లోనే లక్షలు ఉంచుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడి వెళ్లినా కూడా ఆన్ లైన్ పేమెంట్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల వ్యాపారి నుంచి మొదలుకుని ఆటో, కారు డ్రైవర్ల వరకు ఫోన్ పే, గూగుల్ పే స్కానర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో బ్రతకాలంటే తప్పకుండా టెక్నాలజీని వాడాలనే అంటున్నారు. అయితే తాజాగా బెంగుళూరులో వెలుగుచూసిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచం కంటే బెంగుళూరు కాస్త టెక్నాలజీ వాడకంలో ముందుంటుంది.
బెంగుళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఏకంగా టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నాడు. సాధారణంగా ఏ ఆటోలో చూసినా కూడా స్కానర్లు పెట్టుకుని ఉండడం లేదా, వారి ఫోన్లో స్కానర్ చూపించి దానికి స్కాన్ చేసి పేమెంట్ చేయాలని అడగడం వంటివి చేస్తుంటారు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం టెక్నాలజీ వాడకంలో అందరికంటే ఓ ఆకు ముందే ఉన్నాడు. తన స్మార్ట్ వాచ్ లో స్కానర్ ను పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులు తమ స్థలం చేరుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డబ్బులు ఇచ్చే క్రమంలో తాము స్కానర్ అడగ్గా, డ్రైవర్ తన స్మార్ట్ వాచ్ లో క్యూఆర్ కోడ్ చూపించాడు. దానికి స్కాన్ చేయాలని చెప్పాడు. దీంతో ప్రయాణికులు కూడా షాక్ అయ్యారు. దీనిని వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Auto anna pulled out the #peakBengaluru move. pic.twitter.com/Y6750c6ZDU
— Vishvajeet (@Vishvajeet590) September 20, 2024