Shocking Video: వినాయక చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గల్లీ గల్లీలో వినాయకుడి మండపాలు, పాటలతో కలకలలాడుతున్నాయి. మరో రెండు రోజుల్లో నిమర్జనం కూడా జరగబోతుంది. ఇప్పటికే గణేషుడిని ప్రతిష్టించి 8 రోజులు కావోస్తుంది. అయితే బొజ్జ గణపయ్యను పూజించేందుకు భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ తమ కోరికలను తీర్చాలని మొక్కులు పెడుతున్నారు. అయితే బొజ్జ గణపయ్య వాహనం ఎలుక అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలుక వాహనం ఎక్కి ముల్లోకాలు తిరిగేవాడు ఆ గణేషుడు అని అంటారు. అయితే తాజాగా గణపతి చతుర్థి వేడుకల సందర్భంగా ఓ ఎలుక చేసిన వింత పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఓ చిట్టెలుక గజానుని వద్దకు వచ్చి నమస్కారం చేసింది. ఈ విషయం వింటే ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం అండోయ్. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని మీరా భయందర్లో ఒక గణేష్ మండపంలో వెలుగుచూసింది. గణేషుడి వాహనం అయిన మూషికం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ చిట్టి ఎలుక కొన్ని సెకన్ల పాటు చేసిన పని అందరినీ దైవస్మరణ చేసుకునేలా చేసింది. ఒక్కసారిగా గణేషుడి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుక ముందుగా అటు ఇటు చూసింది. అనంతరం ఎవరు లేవరని అక్కడి మోదకాలు తీసుకోవాలని అనుకుంది.
ఈ క్రమంలో ముందుంగా గణేషుడి పాదాల వద్ద రెండు కాళ్లపై నిలబడి నమస్కరించింది. రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టింది. ఈ అరుదైన సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే కేవలం నమస్కరించడం మాత్రమే కాకుండా గణేషుడికి నైవేద్యంగా సమర్పించిన మోదకాలను తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పెరిగింది. దీనికి ఏకంగా తొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram