Viral News: ప్రస్తుతం ఉన్న పద్ధతులకు పూర్వం ఉన్న పద్ధతులకు చాలా తేడా ఉండేది. ఒకప్పుడు అయితే కుటుంబంతో కలిసి బయటికి వెళ్లడం, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి ఉంటేనే సాధ్యం అయ్యేది. అప్పట్లో ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. ఉన్న వాటితో సర్దుకుంటూ ఏదైనా కొత్తగా తినాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా సంవత్సరంలో వేళ్లపై లెక్కపెట్టేన్ని సార్లు మాత్రమే చేస్తుండేవారు. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడూ వెకేషన్లు, టూర్స్, ఫంక్షన్లు, డిన్నర్ అంటూ ఏదో ఒక విధంగా ప్రయాణాలు చేస్తున్నారు.
టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా శ్రమించాల్సి పని లేకుండా పోతుంది. షాపులకు వెళ్లి కొనుగోలు చేయడం సాధ్యం కాని సమయంలో ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే చాలా రకాల ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. వస్తువులే కాదు భోజనం కూడా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఇలా కేవలం ఇంట్లో కోసం, లేదా ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తాజాగా ఓ పెళ్లి జంట ఏకంగా తమ ఎంగేజ్మెంట్ కోసం ఆన్ లైన్ ద్వారా భారీ మొత్తంలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది.
తమ నిశ్చితార్థం కోసం పెళ్లి జంట ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఫోటోలను ఈ మేరకు స్విగ్గీ ఎక్స్ వేదికగా అందరితో పంచుకుంది. భారీ మొత్తంలో తమ నుంచి పెళ్లి జంట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం పట్ల స్విగ్గీ ఆకస్తికర ట్వీట్ చేసింది. ఇలాంటి చాలా రకాల సదుపాయాలు మా వద్ద ఉన్నా కూడా దీనిని ఉపయోగించుకోవడం లేదని, ప్రస్తుతం ఈ జంట తమ సేవలను ఉపయోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ బాక్స్ లను డెలివరీ చేసిన ఫోటోలతో ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
They ordered food online for an engagement ceremony?? Bhai I have seen everything 😭😭 pic.twitter.com/v4szxFg4pM
— Susmita (@shhuushhh_) August 4, 2024