CM Revanth Reddy Tweet on KCR: తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్పై ధ్వజమెత్తిన సీఎం మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
రూ. 97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి చూపించడానికి మేడిగడ్డ పర్యటనకు పిలిస్తే.. చీకటి మిత్రులు బీజేపీతో కలిసి డుమ్మా కొట్టారని మండిపడ్డారు.
కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు క్షేత్రస్థాయి వాస్తవాలు చూడడానికి ఎందుకు రావడంలేదని సీఎం ప్రశ్నించారు.