Cars Offers : ఈ పండుగల సీజన్లో దేశంలో 10 లక్షల కార్లు అమ్ముడవుతాయని వాహన తయారీ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మాంద్యం బెడద లేకుపోవటంతో పలు వాహన కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీలను ప్రకటించాయి. రాయితీ, ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్లే కాకుండా, డీలర్లు సైతం తమవంతుగా కార్ల యాక్సెసరీలపై అదనపు ఆఫర్లను ఇస్తున్నారు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
హ్యుందాయ్ తన ఎక్స్టర్, వెన్యూ, క్రెటా మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్పై రూ.43 వేలు, ఆరాపై రూ.33 వేలు, విద్యుత్ వాహనం కోనాపై రూ.2 లక్షల వరకు రాయితీ ఉంది.
ఎస్యూవీ విభాగంలో కింగ్ అయిన మహీంద్రా.. ఎక్స్యూవీ 300పై రూ.90 వేలు, విద్యుత్ ఎక్స్యూవీ 400పై రూ.1.25 లక్షలు, అధికంగా అమ్ముడయ్యే బొలెరోపై రూ.70 వేలు, బొలెరో నియోపై రూ.50 వేల రాయితీ ఇస్తోంది.కానీ ఎక్స్యూవీ 700, స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్పై ఏ ఆఫరూ లేదు.
టాటా మోటార్స్.. నెక్సాన్, సఫారీ, హ్యారియర్ మోడళ్లలో అప్గ్రేడెడ్ వెర్షన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ పండుగ వేళ రూ.1.40 లక్షల వరకు రాయితీలను ప్రకటించింది.
డీలర్ల ఆఫర్లతో కలిపి మారుతీ సుజుకీ ఆల్టో, వేగనార్, సెలెరియో, ఎస్ ప్రెసో కార్లపై రూ.61 వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. స్విఫ్ట్పై రూ.54 వేల విలువైన ఆఫర్లున్నాయి.అయితే ఈ రాయితీలు కొన్ని మోడళ్లకే వర్తిస్తాయి.