EPAPER

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

trinayani serial today Episode:  భుజంగమణి గురించి గజగండకు చెప్తాడు వల్లభ. పంచకమణి మీ దగ్గర ఉంది కాబట్టి భుజంగమణి ని మీరే  తీసుకురావొచ్చు కదా? అంటాడు వల్లభ. అది సాద్యం కాదని పంచకమణి నేను కష్టపడి సంపాదించి ఉంటే భుజంగమణిని తీసుకొచ్చే శక్తి ఉండేది. కానీ ఇప్పుడు నేను ఆ గుడిలో కూడా అడుగుపెట్టలేను ఒక్క నయని మాత్రమే అక్కడకు వెళ్లగలదు. ఎందుకంటే నయనికి అవసరం కాబట్టి అని గజగండ చెప్తాడు. నయని కనుక మణిని తీసుకొస్తే ఈసారి ఎవరు చూసిస్తామన్నా కూడా ఇవ్వదు అంటుంది తిలొత్తమ్మ. చూడటం కాదు దూరం నుంచి ఫోటో తీసుకుంటామన్న తీసుకోనివ్వదు అని చెప్తాడు వల్లభ. ఒక వేళ విశాల్‌ కనక నయనిని పంపించకుండా రిస్క్‌ తీసుకోవద్దని చెప్తే అని తిలొత్తమ్మ అడగ్గానే భుజంగమణి దక్కదు ఇక్కడ ఎవరూ త్యాగం చేయకూడదు. ఒకరి అవసరాన్ని ఇంకొకరు ముందుకు వెళ్లాలి అంటే విశాల్‌ ను మరింద ఇబ్బంది పెట్టాలి అని గజగండ చెప్పడంతో దాంతో మరదలు మణికాంత దీవికి బయలుదేరడం తథ్యం అంటాడు.


 

ఇంటికి స్పెషల్‌ గెస్ట్‌ వస్తున్నాడు.


హాల్‌ లో తిలొత్తమ్మ, సుమన నిలబడి వల్లభకు త్వరగా రమ్మని చెప్పరా అంటుంది. హాసిని వస్తుంటే వల్లభ ఏ హాసిని హంస నడక అవసరమా నీకు అంటాడు. ఇంతలో విశాల్‌, నయని వస్తారు. చాలా ఇంపార్టెంట్‌ విషయం కాబట్టి అందర్నీ రమ్మన్నాను అని తిలొత్తమ్మ చెప్తుంది. ఏంటని అందరూ అడుగగానే ఇవాళ మన ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నారు అని తిలొత్తమ్మ చెప్పగానే హాసిని ఇరిటేటింగ్‌ ఎవరు పడితే వాళ్లు వచ్చి రెండు రోజులు ఉండిపోతున్నారు. మేము చాకిరి చేయలేక చస్తున్నాం అంటుంది.  నయని ఇంతకీ ఎవరు వచ్చేది అత్తయ్య అని అడుగుతుంది. దీంతో పంచకమణి గ్రహీత గజగండ వస్తున్నాడు అని తిలొత్తమ్మ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. చెల్లి వెళ్లి చీపురుకట్ట, అట్ల కాడ పట్టుకురా.. అని నయనికి చెప్తుంది హాసిని. అనగానే ఏయ్‌ నువ్వనుకున్నంతా ఈజీ అనుకుంటున్నావా? ఆయన మాంత్రికుడు అంటాడు వల్లభ. ఇంతలో గజగండ వస్తాడు. గజగండను రప్పించింది ఎవరో కాదు నయని నేనే అని తిలొత్తమ్మ చెప్తుంది. నయని ఎందుకు అత్తయ్య అని నయని అడగ్గానే డీల్‌ కుదుర్చుకుందామని.. నేను కాదు నువ్వు, గజగండ అని నయనికి చెప్పగానే దేని గురించి అని విశాల్‌ అడుగుతాడు.

 

మణి గురించి డీల్‌ కుదుర్చుకుందాం.

ఇంతలో పంచకమణి తీసి గజగండ దీని గురించి అని చెప్తాడు. డీల్‌ ఓకే చేసుకుంటారని పిలిపిస్తే ఏం మాట్లాడరు ఏంటి నయని అని తిలొత్తమ్మ అడుగుతుంది. ఈ మాంత్రికుడు పంచకమణి ఇవ్వడని చిన్న పిల్ల గాయత్రి పాప కూడా వెళ్లిపోయింది చూడు అత్తయ్య అంటుంది నయని. అయినా కొంచెం కూడా తెలివి లేదు బ్రో.. భుజంగమణి మనతో ఉంటే పంచకమణి కోసం ఎందుకు పాకులాడుతాం అంటాడు విక్రాంత్‌. దీంతో అది ఇస్తానని మాట ఇస్తే ఇది ఇప్పుడే ఇస్తాను అని గజగండ చెప్తాడు. దీంతో హాసిని మాటే కదా నయని ఇవ్వొచ్చు కదా అంటుంది. అయితే నేను ప్రాణం పోయినా మాట తప్పను అక్కా ఆ భుజంగమణి తీసుకొచ్చాక ఇచ్చే ప్రసక్తే లేదు అంటుంది నయని. అయితే నీ భర్త ప్రాణం పోతుందంటే కూడా ఇవ్వవా నయని అని గజగండ బెదిరిస్తాడు. ఒక్కనిమిషం ఇటు చూడు నయని భుజంగమణి తీసుకురావడమే కాదు. నీ దగ్గరున్న ఆ పంచకమణి ని కూడా తీసుకెళ్లి మానసాదేవి ఆలయంలో పెడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో చచ్చేది ఎవరో..? తిరిగి వెళ్లేది ఎవరో.? అంటూ వార్నింగ్‌ ఇస్తాడు విశాల్‌.

 

గజగండ చంపేయబోయిన నయని, గాయత్రిదేవి

ఇంతల ఓఅక్కడికి గాయత్రిదేవి వస్తుంది. ఆమెను చూసిన తిలొత్తమ్మ గాయత్రి అక్కా వస్తుంది అని చెప్తుంది. విశాల్‌ సంతోషంగా నయని అమ్మా వస్తుందా? అని అడుగుతాడు. వస్తున్నారు అని చెప్తుంది నయని. గాయత్రి దేవి వచ్చి గజగండకు ఎదురుగా నిలబడుతుంది. విశాల్‌, నయనిని అమ్మా ఎక్కడ ఉందని అడుగుతాడు. గజగండకు ఎదురుగా నిలబడింది అని చెప్తుంది. గజగండ.. గాయత్రి దేవి అని పిలవగానే నేను ఇచ్చే జీతంతో బతికే నువ్వు నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అంటూ వీళ్లిద్దరూ చేతులు కలిపి నా కొడుకు చేయి పడిపోయేలా చేశారు నయని వీణ్ని ఊరికే వదిలిపెట్టకు నయని అంటుంది గాయత్రిదేవి. దీంతో మీరు నన్నేం చేస్తారు. అంటూ నవ్వుతుంటే.. గాయత్రిదేవి, నయని గజగండ గొంతు పట్టుకుని నులిపేస్తుంటారు. ఇంతలో గజగండ మాయమైపోతాడు. అందరూ షాక్‌ అవుతారు. నయని అమ్మా ఎక్కడున్నారు. అని అడగ్గానే ఇక్కడే ఉన్నారు బాబుగారు అని చెప్తుంది నయని. గాయత్రి దేవి శుక్రవారం వస్తానని నువ్వు మణికాంత గుడికి వెళ్లే మార్గం చెప్తాను. అంతవరకు విశాల్‌ ను ధైర్యంగా ఉండమను అని చెప్పి వెళ్లిపోతుంది. అక్క వెళ్లిపోయింది విశాల్‌ అని తిలొత్తమ్మ చెప్పగానే అమ్మా అమ్మా అంటూ విశాల్‌ ఎమోషనల్‌ అవుతాడు.

 

స్వర్గానికి వెళ్తున్నానన్న విక్రాంత్‌

సుమన భుజంగమణి గురించి ఆలోచిస్తుంది. ఇంతలో విక్రాంత్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. పైకి వెళ్తున్నాను అని విక్రాంత్‌ చెప్పగానే అక్కడికి ఎందుకు అని సుమన అడుగుతుంది. పైన రంభ, ఊర్వశి ఉంటారు కదా? వాళ్లతో డాన్స్‌ చేద్దామని వెళ్తున్నాను అని విక్రాంత్‌ చెప్పగానే మళ్లీ ఎప్పుడొస్తారు అని సుమన అడుగుతుంది. అక్కడ అంత సుఖం ఉండగా ఇక్కడి ఎందుకు వస్తాను అంటాడు. అదంతా వద్దు కానీ భుజంగమణి గురించి నిన్నటి వరకు నాకు సపోర్టు చేశారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు. అయినా గజగండను చంపాలని చూశారు. ఇప్పుడు ఆ గజగండ నయనిని చంపేస్తే అని అడుగుతుంది సుమన. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×