satyabhama Serial Today Episode October 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య చక్రవర్తి మాటలను విని మహదేవయ్య ఎక్కడ తమ్ముడు నిజం చెబుతాడో అని టెన్షన్ పడతాడు.. ప్రతి విషయానికి ఆపుతాడు. ఇక అందరు భోజనం బాగా ఉండయాని సత్యను మెచ్చుకుంటారు.. భోజనం చేసిన తర్వాత చక్రవర్తికి నీళ్లు ఇస్తూ అంకుల్ మీకు క్రిష్ అంటే ఎంత ప్రేమో అని తెలుస్తుంది. సత్య కృష్ణ గురించి ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతుందని అనుకుంటాడు. సత్య, చక్రవర్తి మాట్లాడుకోవడం మహదేవయ్య చూస్తాడు. ఏం కోడలా నిజం తెలుసుకోవాలని చూస్తున్నావా అంటాడు. ఏమో అనుకున్న మస్త్ ఫాస్ట్ ఉన్నావు. తప్పదు కాదు కదా.. సమాజంలో పెద్ద మనిషిలా ఉన్న మనిషిని అసలు స్వరూపం తెలుసుకోవాలి. ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఏం చేస్తానో చూడాలి అనుకుంటున్నావు అని అంటుంది. ఇక హర్ష, నందిని మధ్య మరోసారి మైత్రి విషయంలో గొడవ వస్తుంది. భైరవి పెత్తనం పోవడంతో సత్య పై కోపంతో రగిలి పోతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భైరవి గార్డెన్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడే పంకజం గారెలు తీసుకొని వస్తుంది. సత్య అమ్మగారిని అడిగి చేశాను అంటుంది. ఆ మాట విన్న భైరవి షాక్ అవుతుంది. కోపంతో రగిలి పోతుంది. కానీ పంకజం అలా చూడకండి అంటూ అంటుంది. భైరవి కోపంతో ఏం మాట్లాడుతున్నావ్ పంకజం అని అంటుంది. అదే అమ్మా పెత్తనం ఉన్నంతవరకు ఏదైన మీ చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏది ఉండదు. అయ్యగారు కూడా సత్యమ్మకు సపోర్ట్ చేస్తున్నారు. ముసలి మొసలి ని కుక్కలు కూడా పీక్కు తింటాయి అని సామెత చెబుతుంది. ఈ సత్య వల్ల నా పెత్తనం పోయింది. పనిమనిషి దగ్గర అధికారం కూడా పోయింది. ఇక లాభం లేదు ఆ సత్య దగ్గర నుంచి నా పెత్తనం లాక్కుంటాను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాను.. ఈ భైరవి అంటే ఏమిటో చెప్తాను అని వెళ్తుంది. ఇక క్రిష్ తెలుగు నెలలు రాక శోభనం ఆగిపోయిందని అంటే సిగ్గు పోతుంది అనుకోని తండ్రికి బాగా తెలిసి ఉంటుంది. శోభనం అయ్యింటాది కదా అని అనుకోని వెళ్తాడు. బాపు తెలుగు నెలలు ఎన్ని అంటాడు. మోసాలు గురించి అడుగు చెబుతాను కానీ ఇలా అడిగితే నాకు తెలియదు కానీ ఇలా అడిగితే తెలియదు. అంటాడు ఇక క్రిష్ నిరాశ పడతాడు. ఇక క్రిష్ ఇంట్లోకి వెళ్తాడు. పంకజం ను చూస్తాడు. ఒకటి అడుగుతాను అని అడుగుతుంది. ఎందుకు వచ్చారు బాబు అంటుంది. తెలుగు నెలల గురించి అడిగితే మాకు ఈ నెలలు మాత్రమే తెలుసు అంటుంది. ఈ మాసాలు మాత్రమే తెలుసు అంటే వెళ్ళిపోతాడు. ఇక సత్య టీ తీసుకొని వస్తుంది. మాసాలు తెలుసుకో అని ఇస్తుంది.. చల్లారి పోతుంది అంతే అంతే.. అంటుంది.. పక్కా, పూలు రెడీ చేసుకో అని అంటాడు. ఇక ఇంట్లో అందరు సమావేశం అవుతారు.
ఇక నందిని నడి ఇంట్లో కూర్చొని గోర్లు కత్తిరిస్తుంది. ఆ ఇంట్లో బామ్మ చూసి ఒసేయ్ ఏంటే ఇలా నడి ఇంట్లో కూర్చొని గోర్లు కట్ చేస్తావా.. దరిద్రమే అని అంటుంది. దానికి నందిని ఎక్కడ కట్ చేసుకోవాలి.. గోర్లు పెంచుకుంటే దరిద్రం కానీ కట్ చేస్తే కాదు అని అంటుంది. మొగుడికి నచ్చేలా ఉంటే భర్తకు ఇష్టం లేదంటే కష్టం.. ఏ ఆడదైన అని మొగుడికి నచ్చేలా ఉండాలి.. ఆఫీస్ వెళ్లేవరకు మొగుడు వెనకాల తిరగాలి. పొద్దున్నే లేచి పూజ చేసి మొగుడికి హారతి ఇస్తే అలాంటి ఆడదాన్ని ఏ మగాడు వదులుకోడు అని బామ్మ అంటుంది. అయితే నందిని నాకు చెప్పావు సరే నీ మనుమడికి కూడా చెప్పాలిగా అప్పుడే బాగుంటుంది అని అంటుంది. అలా ఇద్దరి మధ్య కాస్త రచ్చ జరుగుతుంది. నందిని అమ్మమ్మ చెప్పినట్లు వెళ్లి స్నానం చేసి పూజకు రెడీ అయ్యి వస్తుంది.
మహాదేవయ్య అమ్మ అందరిని రమ్మని పిలుస్తుంది. మహదేవయ్య ఏందీ అమ్మా అందరిని రమ్మని పిలిచావు.. చెప్పు అంటుంది. దానికి ఏమి లేదు రా ఇంట్లో అందరు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు.. అని అంటుంది. ఏంటమ్మా అది అంటాడు.. అదే రేణుక సీమంతం అని అంటుంది. అయితే సత్య అక్క సీమంతం మాములుగా ఉండదు. అని అంటే మహదేవయ్య అలాగే అంటాడు.. ఇక రుద్ర మాత్రం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఇక సత్య మొత్తం చెబుతుంది. ఇక భైరవి ఇంట్లో చేద్దాం అంటుంది. అందరు రుద్ర, భైరవిల పై మండిపడుతారు. ఇంట్లో అందరి మధ్య వాదనలు పెరుగుతాయి. చివరకు మహదేవయ్య ఒప్పుకోవడం వల్ల అందరు సంతోషం గా ఉంటారు..
ఇక నందిని స్నానం చేసి వస్తుంది. అప్పుడే మైత్రి పూజ చేస్తుంది. అందరు మైత్రిని మెచ్చుకుంటారు. కానీ నందిని నా ఇంట్లో ఇది పూజ చెయ్యడం అని ఫీల్ అవుతుంది.. ఇక మైత్రి ని నందిని మా ఇంట్లో నువ్వు పూజ చెయ్యడం అందరు సపోర్ట్ చెయ్యడం ఏంటి అంటుంది. హర్ష నువ్వు పూజ చేస్తుంటే ఎవరు వద్దని అనలేదు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో శోభనం కోసం పాట్లు పడటం చూసి సత్య క్లూ ఇస్తుంది. నా ఫ్రెండ్ హాస్టర్ లో ఉంటుంది. దాని గది నెంబర్ నా పుట్టిన నెల అంటుంది.. తన ఫ్రెండ్ తో కలిసి హాస్టల్ కు ముసుగు వేసుకొని వెళ్లి వాచ్ మెన్ కు దొరుకుతారు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..