Satyabhama Serial Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో క్రిష్ సత్య వాళ్ల తెలుగు మాస్టర్ నుంచి నిజం రాబట్టలేక ఇబ్బంది పడతాడు.. సత్య పుట్టిన ఏడాదిని తెలుసుకొని సంబరపడి పోతాడు. ఈరోజు శోభనంకు రెడీగా ఉండు సంపంగి అంటూ మెలికలు తిరిగిపోతాడు.. ఇక మైత్రి పెళ్లి చూపులు విషయంలో అందరు టెన్షన్ పడుతుంటారు. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల వాళ్లు వెళ్ళిపోతారు. బాబాయ్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న క్రిష్ ను చూసి మహదేవయ్య నిజం చెబుతాడా అని టెన్షన్ పడుతుంటాడు.. బాబాయ్ కొడుకు అమెరికాలో ఉన్నాడు పెద్ద చదువులు చదువుతున్నాడని చెబుతుంది. దానికి సత్య ఎవరిని కడుపున పుడితే అలా ఉంటారు అని అంటుంది. చక్రవర్తి ఇక్కడ ఉండటం లేదనే విషయాన్ని గురించి అడిగి తెలుసుకుంటుంది. ఇక మైత్రి సంబంధం చెడిపోతుంది అని అనుకోలేదు అని ఏడుస్తుంది. హర్ష తో బాధపడుతుంది. నాకు ఇక ఏ సంబంధం చూడొద్దు అంటుంది. ఇక సత్య ఆమెను ఓదారుస్తాడు.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య చక్రవర్తి మాట్లాలను విని మహదేవయ్య ఎక్కడ తమ్ముడు నిజం చెబుతాడో అని టెన్షన్ పడతాడు.. ప్రతి విషయానికి ఆపుతాడు. ఇక అందరు భోజనం బాగా ఉండయాని సత్యను మెచ్చుకుంటారు.. భోజనం చేసిన తర్వాత చక్రవర్తికి నీళ్లు ఇస్తూ అంకుల్ మీకు క్రిష్ అంటే ఎంత ప్రేమో అని తెలుస్తుంది. అవును అమ్మా వాడు అమాయకుడు అందుకే నాకు వాడు అంటే ఇష్టం అని అంటుంది. మీరు ఇష్ట పడినట్లు ఈ ఇంట్లో క్రిష్ ను ప్రేమగా చేసుకోరు అంటుంది సత్య.. తల్లీ తండ్రి ప్రేమగానే చూసుకుంటారు. కొందరు బయట పడరు అంటాడు. సత్య కృష్ణ గురించి ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతుందని అనుకుంటాడు. నేను ఎప్పుడో ఒకసారి కలుస్తాను. పక్కన నువ్వే ఉంటావు నీకే తెలుస్తుంది. ఇక భోజనం చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.
సత్య, చక్రవర్తి మాట్లాడుకోవడం మహదేవయ్య చూస్తాడు. ఏం కోడలా నిజం తెలుసుకోవాలని చూస్తున్నావా అంటాడు. ఏమో అనుకున్న మస్త్ ఫాస్ట్ ఉన్నావు. తప్పదు కాదు కదా.. సమాజంలో పెద్ద మనిషిలా ఉన్న మనిషిని అసలు స్వరూపం తెలుసుకోవాలి. ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఏం చేస్తానో చూడాలి అనుకుంటున్నావు. ఆ మాత్రం సొయా ఉంది కదా.. నా గురించి తెలుసుకోవడం అంత సులువు కాదు.. చదువు కున్న వాళ్లు చురుగ్గా ఉంటారు, తెలివైనోళ్లు అనుకున్న, దైర్యవంతులు కూడా అని నిన్ను చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన చిన్నా గాడి అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడం అంత సులువు కాదు.. ఈ జన్మలో నీకు తెలియదు. నువ్వు అసలు తండ్రివి కాదని తెలిసింది కదా.. అది చూద్దాం.. ఆ చిన్నా గాడు నా కొడుకుగా నా ఇంట్లోనే జీవితాంతం పడిఉండాలని అంటాడు మహదేవయ్య..
ఇక నందిని బయటకు వెళ్తుంది. హర్ష వచ్చి ఆపుతాడు.. మైత్రికి మరో మంచి సంబంధం తెస్తాను నన్ను నమ్ము నందిని అంటాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. హర్షను నిలదీస్తుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.. పాలవాడు సత్య అమ్మా అని అరుస్తూ వస్తాడు. భైరవి బయటకు వస్తుంది. ఈ ఇంటికి యజమానురాలు నేను.. నన్ను పిలవాలి సత్య అని పిలుస్తావే.. అది కాదమ్మా ఎప్పుడూ అమ్మగారే పాలు పోయించుకొని డబ్బులు ఇస్తుంది అంటాడు.. అప్పుడే సత్య వచ్చి ఏమైంది ఇదిగో డబ్బులు అని ఇస్తుంది. ఏంటి అత్తయ్య బీపి బాగా పెరిగినట్లు ఉంది.. అని సత్య అనగానే భైరవి నీకే కొవ్వు పెరిగింది తగ్గించుకో అని అంటుంది. అత్తా కోడళ్ల మధ్య రుసరుసలు విని మహదేవయ్య లోపలికి పిలుస్తాడు.. కోడలు పెత్తనం కోసం చూస్తుంది ఇవ్వు.. అప్పుడే ఎటువంటి ఆలోచనలు రావు అంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్య అక్క సీమంతం గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటాడు. రుద్ర వద్దని వాదిస్తాడు. రేపు ఏమీ జరుగుతుందో చూడాలి..