Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మిస్సమ్మను పిలిచి రేపు వినాయకచవితికి మీ అమ్మా నాన్నా వస్తున్నారా? అని అడగ్గానే వస్తున్నారు ఉదయం బయలుదేరుతారంట అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అమర్ ఏమీ రావొద్దని చెప్పు వాళ్లకు అనగానే మిస్సమ్మ సరే చెప్తాను కానీ ఒకసారి రమ్మని మరోసారి వద్దని అంటే పద్దతగా ఉండదని.. ఎందుకు రావొద్దు అని చెప్పాలో రీజన్ చెప్పండి అని అమర్ ను అడుగుతుంది మిస్సమ్మ. దీంతో అమర్ పలకకుండా ఫోన్ తీసుకుని రామ్మూర్తికి కాల్ చేస్తాడు. రేపు అర్జెంట్ వర్క్ ఉంది. అందుకే ఇంట్లో పూజ చేస్తామో లేదోనని డౌటుగా ఉంది. అందుకే రేపు మీరేం రావొద్దని చెప్తాడు. రామ్మూర్తి సరే బాబుగారు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మిస్సమ్మ మాత్రం కారణం ఏదైనా కానీ ఇంటికి పిలిచి వాళ్లను మళ్లీ రావొద్దని చెప్పడం బాగాలేదని చెప్పి వెళ్లిపోతుంది.
తాను ఎవరికీ కనిపంచను అన్న అరుంధతి
Also Read: ‘త్రినయని’ సీరియల్: విశాల్ రూపంలో వచ్చిన గజగండ – గాయత్రి పాప దెబ్బకు గజగండ పరార్
అరుంధతికి హాయ్ చెప్పిన రాథోడ్
అయితే ఇరిటేటింగ్ చూస్తున్న మిస్సమ్మ ఎప్పుడూ నేనే అర్థం చేసుకోవాలా? అంటూ అనుమానంగా బయటకు చూస్తూ అక్కా ఎవర్నీ కూడా లోపలికి రానివ్వడం లేదు మీరెలా వచ్చారు అని మిస్సమ్మ అడగ్గానే వెంటనే ఆరు నేను వాళ్లకు కనిపంచను కదా? అని వెంటనే తేరుకుని నేను వాళ్లుక రోజూ కనిపిస్తానుగా పక్క ఇల్లే అని ఏమీ అనలేదు అని అబద్దం చెప్తుంది ఆరు. ఇంతలో అక్కడికి రాథోడ్ రాగానే ఆరు వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఆరును అక్కా నువ్వు కూర్చో రాథోడ్ రాగానే లేచి వెళ్లిపోవాలా? అంటుంది. దీంతో రాథోడ్ షాక్ అవుతాడు. మిస్సమ్మ బాధలో ఉన్నప్పుడు వాళ్ల అక్కను ఊహించుకుని మాట్లాడుతుందేమో.. అని రాథోడ్ మనసులో అనుకుని తాను కూడా కనిపించని అరుంధతితో మాట్లాడినట్లుగా నటిస్తాడు. సార్ అరెస్ట్ చేసిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడి వల్ల సారుకు ప్రమాదం ఉండొచ్చని టైట్ సెక్యూరిటీ అరెంజ్ చేశారు. అందుకే సారు రామ్మూర్తి గారిని ఇంటికి రావొద్దని ఉంటారు అని రాథోడ్ చెప్పగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. వెంటనే లేచి లోపలికి వెళ్తుంది.
మనోహరికి షాక్ ఇచ్చిన అంజలి
మరోవైపు మనోహరి దగ్గరుక వెళ్లిన అంజు రణవీర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఎందుకు అని అడగ్గానే రేపు మన ఇంట్లో పండగ ఉంది కదా రణవీర్ అంకుల్ ను పండగకి పిలుద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో మనోహరి ఏం వద్దని అతను అంత ఇపార్టెంట్ వ్యక్తి కాదని అయినా వాళ్లకు వినాయక చవితి జరుపుకునే సంప్రదాయం ఉందో లేదో అంటుంది. దీంతో అంజు వాళ్లు కలకత్తా వాళ్లు అంటే అక్కడ అమ్మవారి నవరాత్రులు బాగా జరుపుకుంటారు. సో గణేష్ పడుంగ కూడా జరుపుకోవచ్చు అని చెప్తుంది. అయితే నువ్వేదే పెద్ద కలకత్తాలో ఉండి వచ్చినట్టు చెప్తున్నావు అంటూ తిడుతుంది మనోహరి. దీంతో నాకెందుకో కలకత్తా గురించి కానీ కలకత్తా మనుషుల గురించి కానీ మాట్లాడుకుంటుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అని అంజు చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.
అమర్ ను హగ్ చేసుకున్న మిస్సమ్మ